Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సావిత్రి పాత్రను ఎందుకు చేయలేక పోయానంటే : నిత్యా మీనన్

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇది సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటిస్తోంది.

సావిత్రి పాత్రను ఎందుకు చేయలేక పోయానంటే : నిత్యా మీనన్
, మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (13:21 IST)
ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇది సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే, సమంత, అనుష్క వంటి మరికొంతమంది అగ్రనటులు నటిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో సావిత్రిగా నటించే అవకాశం తొలుత హీరోయిన్ నిత్యామీనన్‌కే వచ్చిందట. కానీ ఆమె ఓ చిన్న కారణంతో అంగీకరించలేక పోయిందట. దీనిపై ఆమె స్పందిస్తూ, మహానటిలో సావిత్రి పాత్ర చేసే అవకాశం ముందు నాకే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతం 'ప్రాణ' అనే చిత్రాన్ని నాలుగు భాషల్లో చేశాం. నాకు నాలుగు భాషలు వచ్చు. అందుకే రైటింట్‌ సైడ్‌ కూడా నేను సహకారం అందించాను. నాలుగు భాషల్లో చేసినా అందులో ఒకే ఒక పాత్ర మాత్రమే కనపడుతుంది. సింక్‌ సౌండ్‌లో సినిమాను చేస్తున్నాం. కేరళలోని హిల్‌ స్టేషన్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. నాలుగు భాషలను వేర్వేరుగా చేశాను. ఈ సినిమాను 23 రోజుల్లోనే పూర్తి చేసినట్టు నిత్యా మీనన్ వివరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంగోపాల్ వర్మ 'జీఎస్టీ'తో కీరవాణికి కూడా చిక్కులు