Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మై డియర్ ఫ్యాన్స్... కాస్త ఓపిక పట్టండి... (Video)

మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు యూత్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆయన మూవీస్ అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇటీవలే బన్నీ నటించి

మై డియర్ ఫ్యాన్స్... కాస్త ఓపిక పట్టండి... (Video)
, శుక్రవారం, 27 జులై 2018 (14:08 IST)
మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు యూత్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆయన మూవీస్ అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇటీవలే బన్నీ నటించిన "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా" సినిమా రిలీజైంది. ఈ చిత్రం ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
 
ఆ సినిమా తర్వాత బన్నీ మరే సినిమాను ప్రకటించలేదు. ఈ సారి సినిమా ప్రకటనకు కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు కూడా. తమ అభిమాన హీరో తదుపరి చిత్రం ఏంటన్న విషయమై అల్లు ఫ్యాన్స్‌లో చర్చ సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్.. తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా స్పందించాడు.
 
'మై డియర్ ఫ్యాన్స్... మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా తదుపరి సినిమా ప్రకటన గురించి ఓపికగా ఉండమని కోరుతున్నాను. ఎందుకంటే అది ఇంకాస్త సమయాన్ని తీసుకోవచ్చు. ఓ మంచి చిత్రాన్ని మీకందించాలని చూస్తున్నాను. కొంతసమయం పడుతుంది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పేందుకు మరింత సమయం తీసుకోనున్నాడనే విషయం ఇట్టే అర్థమైపోతోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైరెక్టర్ మారుతి 'బ్రాండ్ బాబు' ట్రైల‌ర్ విడుద‌ల‌