Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరోగా ఎన్టీఆర్.. నిర్మాతగా రామ్ చరణ్.. మరి దర్శకుడు?

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ అటు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. తన తండ్రి చిరంజీవితో "ఖైదీ నంబర్ 150"వ చిత్రాన్ని నిర్మించిన చెర్రీ.. ఇపుడు మెగాస్టార్‌తోనే "సైరా నరసింహా రెడ్డి" చిత్రా

హీరోగా ఎన్టీఆర్.. నిర్మాతగా రామ్ చరణ్.. మరి దర్శకుడు?
, శనివారం, 22 సెప్టెంబరు 2018 (14:50 IST)
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ అటు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. తన తండ్రి చిరంజీవితో "ఖైదీ నంబర్ 150"వ చిత్రాన్ని నిర్మించిన చెర్రీ.. ఇపుడు మెగాస్టార్‌తోనే "సైరా నరసింహా రెడ్డి" చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ పరిస్థితుల్లో ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.
 
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చెర్రీ ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడనే వార్త ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఒక హీరోగానే కాకుండా ఒక నిర్మాతగా కూడా చెర్రీ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను నెలకొల్పాడు. ఈ బ్యానర్‌పైనే 'ఖైదీ నం.150' సినిమాను చెర్రీ నిర్మించాడు. 
 
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమా 'సైరా నరసింహా రెడ్డి' తెరకెక్కుతోంది. ఇక ఈ బ్యానర్‌లో రాబోయే మూడో సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుందనేది టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే అభిమానుల ఆనందానికి అవధులుండవు.. ఇక అంతా రచ్చ రచ్చే. అయితే దీనిపై కొణిదెల ప్రొడక్షన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఎన్టీఆర్ బయోపిక్‌' ఓవర్సీస్ రైట్స్ కోసం పోటాపోటీ