Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో రష్మిక మందన్న

Rashmika Mandanna

సెల్వి

, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (17:40 IST)
ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాను వెల్లడించింది. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది అసాధారణ వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ '30 అండర్ 30' జాబితాలో రష్మిక మందన్న కూడా చోటు దక్కించుకుంది. 
 
ఈ నేపథ్యంలో రష్మిక మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ రష్మిక మందన్నను సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ అభినందించారు. ఈ ఏడాది ఈ జాబితాలో రష్మిక మందన్నతో పాటు మరో ముగ్గురు నటీమణులు చోటు దక్కించుకున్నారు. 
 
ఈ గుర్తింపుపై రష్మిక తొలిసారి సోషల్ మీడియాలో స్పందించింది. మ్యాగజైన్ కవర్ ఫోటోను షేర్ చేసిన తర్వాత ఆమె తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
 
 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే జ్యోతి యర్రాజీ, పరుల్ చౌదరి క్రీడాకారులు క్రీడా విభాగంలో, రాధికా మదన్, రష్మిక మందన్న వినోద విభాగంలో చోటు సంపాదించుకున్నారు.
 
ఇకపోతే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వం వహించే పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. రష్మిక చివరిగా హిందీలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్‌లో కనిపించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లరి ఈజ్ బ్యాక్ ఆ ఒక్కటీ అడక్కు అంటున్న నరేష్