Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయిపల్లవి ఎంబీబీఎస్ చంపేస్తుందట... ఎలాగో తెలుసా?

"ప్రేమమ్" సినిమా తెలుగులో నాగ చైతన్య కెరీర్‌లో చాలాకాలం నిరీక్షణ తర్వాత పెద్ద హిట్టుగా నిలిచింది. ఇది మళయాళం నుండి రీమేక్ చేసారు. ఈ వెర్షన్‌లో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు తెలుగులోనూ అదే పాత్రలతో చేసారు. కానీ శృతీహాసన్ చేసిన పాత్ర

సాయిపల్లవి ఎంబీబీఎస్ చంపేస్తుందట... ఎలాగో తెలుసా?
, సోమవారం, 19 జూన్ 2017 (17:22 IST)
"ప్రేమమ్" సినిమా తెలుగులో నాగ చైతన్య కెరీర్‌లో చాలాకాలం నిరీక్షణ తర్వాత పెద్ద హిట్టుగా నిలిచింది. ఇది మళయాళం నుండి రీమేక్ చేసారు. ఈ వెర్షన్‌లో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు తెలుగులోనూ అదే పాత్రలతో చేసారు. కానీ శృతీహాసన్ చేసిన పాత్రను మలయాళంలో సాయిపల్లవి చేసింది. ఆమె మంచి డాన్సర్ కూడా. కొన్నేళ్ల క్రితం తమిళనాడు నుంచి వచ్చి ఈటీవిలో ప్రసారమయ్యే "ఢీ"లో పాల్గొంది. 
 
ఆ సినిమాలో నటించే సమయంలో ఆమె M.B.B.S మూడవ సంవత్సరం చదువుతోంది. అదే సమయంలో ఈ సినిమా ఆఫర్ వచ్చింది. అంతేకాకుండా ఆ సినిమాలో ఒక పాటకి కొరియోగ్రఫీ చేసింది. అది కాస్త ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాకు ఆమె ఎంతలా ప్లస్ అయ్యిందంటే, 4 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒక్క మలయాళ భాషలోనే 60 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆమె నటన ముందు తెలుగులో చేసిన హీరోయిన్ తేలిపోయింది. 
 
ఇప్పుడు సాయిపల్లవి తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న "ఫిదా" సినిమాలో వరుణ్ తేజ్ పక్కన అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై అందరినీ ఆకర్షిస్తోంది. ఆమెకోసం ఎన్నో ఛాన్స్‌లు ఇప్పటికే ఎదురు చూస్తున్నాయి. ఫిదా సినిమా కాస్త హిట్టయితే మరిన్ని సినిమాలతో బిజీ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ గడ్డి పీక్కోవడం చూశానంటున్న నటుడు...