Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయి తేజ్ కు ఇంటర్నల్ బ్లీడింగ్ లేదుః నిర్మాత అల్లు అరవింద్

సాయి తేజ్ కు ఇంటర్నల్ బ్లీడింగ్ లేదుః నిర్మాత అల్లు అరవింద్
, శనివారం, 11 సెప్టెంబరు 2021 (14:21 IST)
Allu Arvind,
'రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదం లేదు. చాలా క్షేమంగా ఉన్నాడు. నేను వైద్యుల దగ్గర మాట్లాడి మీ దగ్గర ఈ మాట చెబుతున్నాను సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో కంగారు అవసరం లేదు. మీకు డాక్టర్ల హెల్త్ బులిటెన్ కావాలంటే వస్తుంది. తలకు గానీ శరీరంలో మారెక్కడా ఇంటర్నల్ బ్లీడింగ్ లేవని వైద్యులు తెలిపారు. జనరల్ వార్డుకు తీసుకొస్తారని సాధారణంగా మాట్లాడతాడని వైద్యులు నాతో చెప్పారు. మీడియాలో ఏవేవో వార్తలు రాకుండా ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చి చెప్పాలి కాబట్టి.. నేను చెప్తున్నాను. మళ్లీ చెప్తున్నాను సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడు..'' అని శ‌నివారంనాడు అపోలో దగ్గర మీడియాతో తెలిపారు అల్లు అరవింద్.
 
సాయిధ‌ర‌మ్‌తేజ్‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న డాక్ట‌ర్లు వీరే. 
అపోలో హాస్పిటల్ వైద్యులు. 
డాక్టర్ అలోక్ రంజాన్ న్యూరోసర్జరీ  
డాక్టర్ సుబ్బారెడ్డి క్రిటికల్ కేర్
డాక్టర్ సాయి ప్రవీణ్ హరనాథ్ పాలమనాలకిస్ట్
డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి ఆర్థోపెడిక్స
సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ ఇవ్వనున్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీరకట్టులో ఆకట్టుకున్న డింపుల్‌- ఖిలాడి- ఫస్ట్ సింగిల్ రిలీజ్‌