Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సామాన్యుడి సహనాన్ని పరీక్షించొద్దు.. శశికళకు కమల్ హాసన్ వార్నింగ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికళ నటరాజన్‌కు విశ్వనటుడు కమల్ హాసన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. సామాన్యుడి సహనాన్ని పరీక్షించవద్దంటూ ఘాటుగా స్పందించారు. గడ్డిపోసలన్నీ కల

సామాన్యుడి సహనాన్ని పరీక్షించొద్దు.. శశికళకు కమల్ హాసన్ వార్నింగ్
, సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (14:57 IST)
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికళ నటరాజన్‌కు విశ్వనటుడు కమల్ హాసన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. సామాన్యుడి సహనాన్ని పరీక్షించవద్దంటూ ఘాటుగా స్పందించారు. గడ్డిపోసలన్నీ కలిస్తే మదగజాన్ని బంధించగలవని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెల్సిందే. 
 
అలాగే, భారత క్రికెట్ జట్టు క్రికెటర్ అశ్విన్ కూడా పవర్ పంచ్‌తో శశికళపై విరుచుకుపడిన విషయం తెల్సిందే. ఇదే అంశంపై ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశాడు. ‘త్వరలో రాష్ట్ర యువతకు 234 ఉద్యోగాలు రావడం ఖాయం’ అంటూ శశికళపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘తమిళనాడులోని యువకులందరికీ శుభవార్త... త్వరలో 234 ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి’’ అని పోస్టు చేశాడు.  తమిళనాడు అసెంబ్లీలో 235 అసెంబ్లీ స్థానాలు ఉండడంతో త్వరలో 234 ఉద్యోగాలు అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి... ఎప్పటికీ చిరంజీవినే... గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు: కే విశ్వనాథ్‌