Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్- ఆవకాయ ఎర్రగా వుందని ముఖానికి?

నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయల్ హీరో హీరోయిన్లుగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్లో అను, చైతూ, రమ్య లుక్స్ అదిరిపోయాయి. నాగచై

శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్- ఆవకాయ ఎర్రగా వుందని ముఖానికి?
, శుక్రవారం, 31 ఆగస్టు 2018 (16:20 IST)
నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయల్ హీరో హీరోయిన్లుగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్లో అను, చైతూ, రమ్య లుక్స్ అదిరిపోయాయి. నాగచైతన్య తన గురించి తాను చెబుతున్నట్లు సినిమా ట్రైలర్ మొదలైంది. 
 
ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయల్‌ల మధ్య చైతూ నలిగిపోతాడని ట్రైలర్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో పృథ్వీ, వెన్నెల కిశోర్‌ల పాత్రలకు కూడా స్కోప్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఆవకాయని అన్నంలో కలుపుకొని తినాలి గానీ.. ఎర్రగా ఉంది కదా అని ముఖానికి పూసుకోకూడదు అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ అదిరింది. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి కాంబో మూవీ వార్త‌ల్లో నిజ‌మెంత‌..?