Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజేంద్ర ప్రసాద్‌పై పడిన శ్రీరెడ్డి.. మాళవికను ఎలా వేధించాడో.. నటి హేమ?

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో అర్ధనగ్న ప్రదర్శన చేసి వివాదాస్పదమైన శ్రీరెడ్డి..సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌పై పడింది. అతనో కామపిశాచి అంటూ కామెంట్ చేసింది.

రాజేంద్ర ప్రసాద్‌పై పడిన శ్రీరెడ్డి.. మాళవికను ఎలా వేధించాడో.. నటి హేమ?
, ఆదివారం, 7 అక్టోబరు 2018 (15:07 IST)
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో అర్ధనగ్న ప్రదర్శన చేసి వివాదాస్పదమైన శ్రీరెడ్డి.. కోలీవుడ్ రంగంలోని ప్రముఖులను వదిలిపెట్టలేదు. మళ్లీ టాలీవుడ్ సెలెబ్రిటీలను కూడా శ్రీరెడ్డి ఆటాడుకుంటోంది. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌పై పడింది. అతనో కామపిశాచి అంటూ కామెంట్ చేసింది. మానసిక రోగి అని, అతడిని మెంటల్ హాస్పిటల్‌లో చేర్చాలంది. 
 
సీనియర్ హీరోయిన్ మాళవిక ఇండస్ట్రీని వదిలి ఎందుకు వెళ్ళిపోయిందో అందరికి తెలుసునని.. అలాగే మా అసోసియేషన్ నుంచి రాజేంద్ర ప్రసాద్ ఎందుకు బయటికి వచ్చారో కూడా తెలుసునని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. మాళవికను రాజేంద్ర ప్రసాద్ ఎంత వేధించారో.. మహిళా ఆర్టిస్టులని కోర్కెలు తీర్చమని ఎంతగా ఇబ్బంది పెట్టావో అందరికీ తెలుసునని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. 
 
రాజేంద్ర ప్రసాద్ కుమార్తె ఇంటి నుంచి ఎందుకు పారిపోయిందో తెలుసు. నటి హేమ రాజేంద్ర ప్రసాద్‌తో ఎందుకు గొడవకు దిగిందో కూడా అందరికీ తెలుసు. ఓ సీనియర్ నటుడిగా మిమ్మల్ని గౌరవిస్తాను కానీ ఓ మనిషిగా మాత్రం కాదంటూ రాజేంద్ర ప్రసాద్‌పై తీవ్రస్థాయిలో శ్రీరెడ్డి విరుచుకుపడింది. 
 
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ కూడా స్పందించారు. శ్రీరెడ్డి తనను ఎందుకు అపార్ధం చేసుకుందో.. అర్ధం కావడం లేదని అన్నారు. తానెప్పుడూ శ్రీరెడ్డిని గురించి ప్రస్తావించనూ లేదు విమర్శించనూ లేదన్నారు. నిజానికి ఆమెను సపోర్ట్ చేస్తూ.. మాలో మాట్లాడాను, అలాంటిది ఆమె ఎందుకు అపార్థం చేసుకుంటే అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు. మొదటి నుంచి తాను వివాదాలకు దూరంగా వుంటున్నానో తెలియదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వు ఎవరి డీపీ పెట్టుకున్నావో.. ఆయన విలువ తియ్యకు... పూనమ్ కౌర్