Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో బంపర్ ఆఫర్.. ఒక కేజీ కేక్ కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరలు బాగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా మండిపోతున్నాయి. ఫలితంగా చెన్నై మహానగరంలో ఒక లీటరు పెట్రోల్ ధ

చెన్నైలో బంపర్ ఆఫర్.. ఒక కేజీ కేక్ కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ
, శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (18:56 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరలు బాగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా మండిపోతున్నాయి. ఫలితంగా చెన్నై మహానగరంలో ఒక లీటరు పెట్రోల్ ధర రూ.86 పైగా పలుకుతోంది.
 
ఈనేపథ్యంలో చెన్నై నగర వాసులకు ఓ బేకరీ షాపు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక కేజీ కేక్ కొనుగోలు చేస్తే ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఇపుడు వైరల్ అయింది. 
 
డీసీ బేకరీ ఈ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. అయితే, ఈ బేకరీలో ఒక కేజీ కేక్ ధర రూ.495. ఒక లీటరు పెట్రోల్ ధర రూ.86. సో... రూ.495 చెల్లిస్తే... ఒక లీటరు పెట్రోలును ఉచితంగా ఇస్తుందన్నమాట. అయితే, ఈ బేకరీ షాపు చిరునామా మాత్రం సోషల్ మీడియా పోస్టులో కనిపించడం లేదు. 
 
కాగా, దేశంలో పెట్రోలు ధర మండుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఇటీవల ఒక పెళ్లి వేడుకలో వధూవరులకు 5 లీటర్ల పెట్రోలును బహుమతిగా ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. శుక్రవారం రాష్ట్ర రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 86.01 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీ, ముంబై రెండింటిలో 10 పైసలు పెరిగి రూ.82.32, రూ.89.92 ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబా ప్రధాని అయితే రూ. 39కే లీటర్ పెట్రోల్