Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా మధ్య ఉన్నది ప్రేమ కాదు.. అదో టైపు రిలేషన్.. వరలక్ష్మి శరత్ కుమార్

మా మధ్య ఉన్నది ప్రేమ కాదు.. అదో టైపు రిలేషన్.. వరలక్ష్మి శరత్ కుమార్
, బుధవారం, 31 అక్టోబరు 2018 (12:03 IST)
హీరో విశాల్‌, తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై వరలక్ష్మి తాజాగా స్పందించారు. 
 
తాను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు చెబుతా. విశాల్‌తో నాకున్న బంధం ప్రేమ కాదు. మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. నా అభిప్రాయాల్ని తనతో పంచుకుంటూ ఉంటాను. అంతలో మాత్రాన పెళ్లి అనిరాయడం సరికాదు అని వ్యాఖ్యానించారు. 
 
అలాగే తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం "సర్కార్‌"లో ప్రజలకు ఓటు విలువ గురించి చెప్పే ప్రయత్నం చేశాం. ఈ చిత్రానికి నేనే తెలుగు డబ్బింగ్ చెప్పా. నేనెప్పుడూ సినిమాను ముందే చూడను. విడుదల తర్వాత నేరుగా థియేటర్‌లో చూస్తా. కానీ ఈ సినిమాలో నా పాత్ర వరకు చూశా, బాగా వచ్చింది. నాకు ఇది సవాలుతో కూడుకున్న పాత్ర అని చెప్పింది. 
 
ఈ చిత్రం విడుదలకు ఉన్న అడ్డంకులు అధికమించి ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసింది. కాగా, విశాల్ తాజా చిత్రం 'పందెంకోడి-2'. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ పాత్రలో కనిపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జున కోసం స్క్రిప్ట్ రెడీ చేశాడట.. కానీ...?