Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేణు మాధవ్‌కి బోలెడంత భవిష్యత్ వుంది... కానీ దేవుడు చిన్నచూపు చూశాడు: చిరంజీవి

వేణు మాధవ్‌కి బోలెడంత భవిష్యత్ వుంది... కానీ దేవుడు చిన్నచూపు చూశాడు: చిరంజీవి
, బుధవారం, 25 సెప్టెంబరు 2019 (17:16 IST)
వేణుమాధ‌వ్ మృతికి చిరంజీవి సంతాపం తెలియజేశారు. ప్ర‌ముఖ హాస్య న‌టుడు వేణు మాధ‌వ్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో ఓ ప్ర‌యివేట్ ఆసుప‌త్రిలో అనారోగ్యం కార‌ణంగా తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. వేణు మాధవ్ అకాల మరణంపై మెగాస్టార్ చిరంజీవి దిగ్ర్భాంతిని వ్య‌క్తం చేసారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.
 
వేణుమాధ‌వ్ తొలిసారి తనతో క‌లిసి మాస్ట‌ర్ సినిమాలో న‌టించాడని గుర్తు చేసుకున్నారు. అటుపై ప‌లు సినిమాల్లో న‌టించి హాస్య‌న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడనీ, కొన్ని పాత్ర‌లు త‌న‌కోసమే పుట్టాయ‌న్నంతగా న‌టించేవాడని అన్నారు.

ఆ పాత్ర‌కే వ‌న్నే తీసుకొచ్చేవాడనీ, వ‌య‌సులో చిన్నవాడు... సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కింకా బోలెడంత భ‌విష్య‌త్ ఉంద‌ని అనుకునే వాడిన కానీ దేవుడు చిన్న చూపు చూసాడు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూర‌ల‌ని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాన‌న్నారు" అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేణుమాధవ్ మృతి.. పవన్ కల్యాణ్, చంద్రబాబు దిగ్భ్రాంతి..