Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా' గాయని రాణి ఇక లేరు

అలనాటి మేటి సినీ నేపథ్య గాయని కె. రాణి (75) ఇకలేరు.. పది సంవత్సరాల వయసులోనే దేవదాసు చిత్రంలో "అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా" అంటూ విషాదకర పాటతో పాపులర్ అయిన రాణి, హైదరాబాద్ కళ్యాణ్ నగర్ లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంట రాత్రి 9.10 నిముషాలకు కన

'అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా' గాయని రాణి ఇక లేరు
, శనివారం, 14 జులై 2018 (16:39 IST)
అలనాటి మేటి సినీ నేపథ్య గాయని కె. రాణి (75) ఇకలేరు.. పది సంవత్సరాల వయసులోనే దేవదాసు చిత్రంలో "అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా" అంటూ విషాదకర పాటతో పాపులర్ అయిన రాణి, హైదరాబాద్ కళ్యాణ్ నగర్ లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంట రాత్రి 9.10 నిముషాలకు కన్నుమూశారు. 
 
ఈ విషయాన్ని  రాణి చిన్న కుమార్తె కవిత ధృవీకరించారు. 9వ యేట సినీరంగ నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసిన రాణి 1951 నుంచి గాలివీటి సీతారామిరెడ్డిని వివాహం చేసుకునే వరకూ షుమారు 500 పాటలు పలు భాషల్లో ఆలపించారు. శ్రీలంక జాతీయ గీతం ఆలపించిన ఘనత కూడా రాణికి దక్కింది.
 
"ఇన్నిసాయ్ రాణి" అని అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె. కామరాఙ్ ఆమెని కీర్తించారు. భారత రాష్ట్రపతి భవన్‌లో అప్పటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరులను ఆమె తన గానామృతంతో ఓలలాడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికాగో సెక్స్ దందా.. కిషన్, చంద్రకళ దోషులే.. అమెరికా కోర్టు