Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'నేను విన్నాను.. నేనున్నాను'.. భరోసానిచ్చే "యాత్ర" టీజర్ అదిరింది

'నేను విన్నాను.. నేనున్నాను'.. భరోసానిచ్చే
, శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:11 IST)
దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "యాత్ర". మహి వి. రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో అంటే వైఎస్ఆర్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. 
 
పాదయాత్ర సమయంలో రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించాడు అన్నది ఈ సినిమా కథ. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. 
 
ఈ టీజర్‌లో రైతులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టేలా చూపించారు. "పంటపండించే రైతుకు సరైన సమయానికి వర్షాలు పడవు.. కరెంట్ ఉండదు.. అన్ని ఉంటె గిట్టుబాటు ధర ఉండదు అనే రైతే రాజు అంటారు.. రాజుగా కాదు కనీసం రైతును రైతుగా గుర్తిస్తే చాలు" అనే డైలాగ్స్  టీజర్ సాగుతుంది. 
 
దీనికి ప్రతిగా "నేను విన్నాను.. నేనున్నాను" అనే డైలాగ్‌తో టీజర్ ఎండ్ అవుతుంది. రైతు చుట్టూనే ఈ సినిమా నడుస్తుందని ఇట్టే తెలిసిపోతుంది. మహి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పొచ్చు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ తారక రాముడితో బసవతారకమ్మ... విద్యాబాలన్ ఫస్ట్ లుక్ అదుర్స్