Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైభవోపేతంగా గరుడ వాహన సేవ - అశేషంగా తరలివచ్చిన భక్తజనం (video)

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడవాహనసేవ వైభవోపేతంగా జరిగింది. గరుడవాహనంపై స్వామివారిని దర్సించుకునే సర్వపాపాలు తొలగిపోయి సుఖ శాంతులతో ఉంటామన్నది భక్తుల నమ్మకం. ప్రతియేటా జరిగే గరుడ

వైభవోపేతంగా గరుడ వాహన సేవ - అశేషంగా తరలివచ్చిన భక్తజనం (video)
, గురువారం, 28 సెప్టెంబరు 2017 (13:09 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడవాహనసేవ వైభవోపేతంగా జరిగింది. గరుడవాహనంపై స్వామివారిని దర్సించుకునే సర్వపాపాలు తొలగిపోయి సుఖ శాంతులతో ఉంటామన్నది భక్తుల నమ్మకం. ప్రతియేటా జరిగే గరుడ సేవ కన్నా ఈ యేడాది భక్తుల రద్దీ మరింత పెరిగింది. 
 
లక్షలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. మధ్యాహ్నానికే గ్యాలరీలలో భక్తులు కూర్చుండిపోయారు. గోవిందా..గోవిందా అంటూ పెద్ద ఎత్తున స్వామివారి నామస్మరణలు చేశారు. మాఢావీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా జనమే. భక్తజన సంద్రంగా మారిపోయింది.
 
శ్రీవారి గరుడ వాహన సేవకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ సేవ కోసం టీటీడీ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. గరుడ వాహన సేవ సందర్భంగా 3,700 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్.. యనమలకు ఏమౌతారు?