Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు...(వీడియో)

శ్రీ వేంకటేశ్వరుడి తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. సప్తాశ్వాలపై భానుడు రథసారధిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్య భగవానుడికి తానే ప్

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు...(వీడియో)
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (21:39 IST)
శ్రీ వేంకటేశ్వరుడి తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. సప్తాశ్వాలపై భానుడు రథసారధిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్య భగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెప్పేలా ఈ వాహన సేవ సాగింది. 
 
అలాగే, ఈ రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి ఊరేగుతారు. తెల్లటి వస్త్రాలు, పూల మాలలు ధరించి స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని ఈ వాహనాల ద్వారా తెలియజేస్తారు స్వామివారు. వీడియో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేరేడు ఆకులు, పండ్లు, బెరడు ఎలా ఉపయోగపడతాయో తెలుసా?