Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసెంబ్లీ బైపోల్ : బీజేపీకి చెంపపెట్టు.. విపక్షాలకు బలం....

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 10 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. మొత్తం పది సీట్లలో రెండు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ కే

అసెంబ్లీ బైపోల్ : బీజేపీకి చెంపపెట్టు.. విపక్షాలకు బలం....
, గురువారం, 31 మే 2018 (15:22 IST)
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 10 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. మొత్తం పది సీట్లలో రెండు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ కేవలం ఒక్క సీటులోనే విజయం సాధించగా, మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇతర సీట్లలో కూడా గెలవలేకపోయింది. అదేసమయంలో విపక్ష పార్టీలు మాత్రం తమతమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మాత్రం పంజాబ్‌లో ఎస్ఏడీ స్థానాన్ని తన వశం చేసుకుంది.
 
గురువారం వెల్లడైన ఈ ఫలితాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఖాతాలో ఉన్న నూర్పూర్ అసెంబ్లీ సీటును ఎస్పీ కైవసం చేసుకుంది. అలాగే, షాకోట్ (పంజాబ్)ను కాంగ్రెస్ (ఎస్ఏడీ), జోకిహాట్ (బీహార్) సీటును ఆర్జేడీ (జేడీయు), గోమియా (జార్ఖండ్), సిల్లి (జార్ఖండ్) సీట్లను జేఎంఎం, చెంగన్నూరు (కేరళ)లో సీపీఎం, పలేస్ కడేగాన్ (మహారాష్ట్ర) సీటును కాంగ్రెస్, థరాలి (ఉత్తరాఖండ్)లో కాంగ్రెస్, మహేస్థల (వెస్ట్ బెంగాల్)లో టీఎంసీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ స్థానాలకు ఈనెల 28వ తేదీన ఓటింగ్ జరుగగా, 31వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనార్టీలో పడిపోయిన ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు? ఎలా?