Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాస్తిక నేత కరుణానిధి స్వర్గ ప్రాప్తినా? వేదపండితులేమంటున్నారు...

తన జీవితంలో భగవంతుడిని నమ్మని పరమ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి స్వర్గానికి వెళ్లారని తమిళనాడు పండితులు చెబుతున్నారు. నాస్తికవాది అయిన కరుణాని

నాస్తిక నేత కరుణానిధి స్వర్గ ప్రాప్తినా? వేదపండితులేమంటున్నారు...
, శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:23 IST)
తన జీవితంలో భగవంతుడిని నమ్మని పరమ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి స్వర్గానికి వెళ్లారని తమిళనాడు పండితులు చెబుతున్నారు. నాస్తికవాది అయిన కరుణానిధి ఏకాదశి (మంగళవారం) సాయంత్రం మృతి చెందటం, ద్వాదశి (బుధవారం)నాడు ఖననం చేయడంతో ఆయనకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
నిజానికి ఏకాదశినాడు సూర్యాస్తమయం వేళ మరణించడం, ద్వాదశి ఘడియల్లో అంత్యక్రియలు జరగడంతో ఆయనకు స్వర్గ ప్రాప్తి లభించిందని, ఇటువంటి భాగ్యం అందరికీ లభించదని అంటున్నారు. నాస్తికుడైన కరుణ అరుదైన అదృష్టానికి నోచుకున్నారని చెబుతున్నారు. ఆయనకు మోక్షప్రాప్తి కలగాలని చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం రాజగోపురంపై పూజారులు మోక్ష దీపాలను కూడా వెలిగించడం గమనార్హం. 
 
ఇంకోవైపు, కరుణానిధిపై దాఖలైన 13 పరువునష్టం కేసులను కొట్టి వేస్తూ చెన్నై ప్రిన్సిపల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులన్నీ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన కేసులు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలుతో కికి ఛాలెంజ్.. యువకులకు భలే శిక్ష విధించిన కోర్టు...