Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే ట్రాక్‌పై పడిపోయిన వ్యక్తిని కాపాడిన రైల్వే ఉద్యోగి (video)

Railway
, శుక్రవారం, 24 జూన్ 2022 (15:35 IST)
Railway
రైల్వే ట్రాక్‌పై పడిపోయిన వ్యక్తిని రక్షించడానికి రైల్వే ఉద్యోగి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అతన్ని రక్షించాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాకు చిక్కింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటనకు సంబంధించి వీడియో రైల్వే మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. రైల్వే ఉద్యోగి హెచ్ సతీష్ కుమార్ ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలుకు జెండాను ఊపేందుకు ప్లాట్‌ఫారమ్ వైపు వెళ్లాడు. ఇంతలోనే రైల్‌ ట్రాక్‌పై వ్యక్తి పడిపోవడాన్ని చూసి వెంటనే అతన్ని రక్షించేందుకు ఆ ట్రాక్‌పైకి దూకాడు.
 
అలా పడిపోయిన వ్యక్తిని ప్రాణాలతో రక్షించాడు రైల్వే ఉద్యోగి. ఇదే క్రమంలో రైలు కూడా చాలా వేగంతో వచ్చింది. రెండు సెకన్లు ఆలస్యమైన ఇద్దరి ప్రాణాలు పోయోవి. సతీష్ దైర్య, సాహాసాలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ 24 సెకన్ల సిసిటిని ఫుటేజీని రైల్వే మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ఖాతా ద్వారా విడుదల చేసింది.
 
సతీష్ కుమార్ కొన్ని సెకన్లు ఆలస్యం చేసి ఉంటే.. రైల్వే ట్రాక్‌పై పడిపోయిన వ్వక్తి ఇద్దరిని రైలు ఢీకొని ఉండేది. అయితే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతను కావలనే పడిపోయాడా లేక ప్రమాదవశాత్తు పడిపోయడే అనే అంశంపై పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి బరాత్‌లో తుపాకీతో కాల్పులు.. మిస్ ఫైర్.. యువకుడి మృతి (video)