Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ... సెలెబ్రిటీ ఐతే.. మృతదేహం అయినా పర్వాలేదా?

టీడీపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి నందమూరి అభిమానులను, కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూ

హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ... సెలెబ్రిటీ ఐతే.. మృతదేహం అయినా పర్వాలేదా?
, శుక్రవారం, 31 ఆగస్టు 2018 (15:55 IST)
టీడీపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి నందమూరి అభిమానులను, కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూరులో స్నేహితుడి కుమారుడి పెళ్లికి వెళ్తుండగా నల్గొండలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలపాలైన వారిని అక్కిడికి దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హరికృష్ణ కన్నుమూశారు. 
 
కాగా సదరు ప్రైవేటు ఆస్పత్రిలో సిబ్బంది చేసిన ఓ నిర్వాకం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. విమర్శలకు దారితీస్తోంది. హరికృష్ణ లేరనే విషయాన్ని నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. అందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే.. ఆ ఆస్పత్రి సిబ్బంది మాత్రం మృతదేహంతో సెల్ఫీ దిగారు. అది కూడా నవ్వుకుంటూ ఫోటోకి ఫోజ్ ఇచ్చి మరీ దిగారు. 
 
ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోకు నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలెబ్రిటీ ఐతే.. మృతదేహం అయినా పర్వాలేదా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మానవీయ విలువలు దిగజారిపోయాయనేందుకు ఈ ఫోటోనే నిదర్శనమని ఫైర్ అవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌లో బాహుబలి - భళ్లాలదేవ యుద్ధం.. ఎప్పుడో తెలుసా?