Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి : ఉండవల్లి

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిజాలు చెప్పాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.

చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి : ఉండవల్లి
, గురువారం, 29 మార్చి 2018 (11:51 IST)
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిజాలు చెప్పాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను పక్కనె పెట్టి, రాష్ట్రాన్ని కాపాడేందుకు వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. 
 
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని కోరారు. కేంద్రంపై న్యాయ పోరాటం చేయాలని సూచించారు. ప్రత్యేక హోదాకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులలో రిట్ పిటిషన్లు ఉన్నాయని... వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని సూచించారు. 
 
కౌంటర్ ఫైల్ చేయడానికి 24 గంటల సమయం కూడా పట్టదన్నారు. చంద్రబాబు బాధ్యతలను నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో తనకున్న విచక్షణాధికారంతో తమను అప్పటి స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారని... ఇప్పుడు సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులను కూడా స్పీకర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపిస్టులను బహిరంగంగా కాల్చిపారేయాలి : బీజేపీ ఎంపీ