Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మష్రూమ్ బిర్యానీ...

మష్రూమ్ బిర్యానీ...
, గురువారం, 29 నవంబరు 2018 (11:33 IST)
పుట్టగొడుగులు కనీసం వారానికి రెండు నుండి నాలుగు సార్లు తీసుకుంటే హైబీపీ అదుపులో ఉంటుంది. శరీరానికి కావలసిన విటమిన్ డి పుట్టగొడుగులో అధిక మోతాదులో ఉంది. దీనిలోని పోషక విలువలు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇలాంటి పుట్టగొడుగుతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
పుట్టగొడుగులు - 200 గ్రా
బియ్యం - 2 కప్పులు
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పచ్చిమిర్చి - 1
నూనె - తగినంత
గరం మసాలా - 1 స్పూన్
ఉల్లిపాయ - 1
టమోటా - 1
ఉడికించిన గుడ్డు - 1
క్యాప్సికమ్ - 2
కొత్తిమీర - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా పుట్టగొడుగులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడయ్యాక పుట్టగొడుగులు వేసి నీరంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. మరో బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు వేయించి గరంమసాలా వేసి ముందుగా వేయించికున్న పుట్టగొడుగులు చేర్చి మరికొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని తగినన్ని నీరు చేర్చి ఉడికించుకోవాలి. అన్నం సగం ఉడికిన తరువాత క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ, టమోటా, గుడ్డు వేసి కాసేపు ఉడికించి తీసుకుంటే వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బియ్యం నీటిలో దాల్చిన చెక్క పొడి కలిపి సేవిస్తే..?