Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శీతాకాలంలో చర్మం నిగారింపు కోసం.. ఇలా చేయాలి..?

శీతాకాలంలో చర్మం నిగారింపు కోసం.. ఇలా చేయాలి..?
, మంగళవారం, 8 జనవరి 2019 (12:50 IST)
శీతాకాలంలో చర్మం నిగారింపు కోల్పోయి పలురకాల సమస్యలు ఎదుర్కుంటారు. అంతేకాదు.. ముఖం ముడతలుగా, ఏవేవో మచ్చలు ముఖం చూడడానికే విసుగుగా ఉంటుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.. మరి అవేంటో తెలుసుకుందాం..
 
చలికి ముఖం పగిలి ఎర్రగా మారిందంటే.. ఆ ప్రాంతాల్లో గ్రీన్‌టిన్‌టెడ్ మాయిశ్చరైజర్‌ని రాస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా ఈ చలికాలంలో చర్మం పగిలిపోయే కాలం కాబట్టి మ్యాటీ తరహా లిప్‌స్టిక్‌లు వేసుకోకూడదు. ఒకవేళ సన్‌స్క్రీన్ ఉంటే టిన్‌టెడ్ లిప్‌బామ్‌లకు ప్రాధాన్యం ఇవాల్సి ఉంటుంది. అలానే పాడైనా చర్మానికి ఏ అలంకరణ చేసినా బాగుండదు. 
 
ఈ చలికాలంలో చర్మం నిరాగింపును సంతరించుకోవాలంటే.. పాలు, పెరుగు తీసుకోవాలి. ఈ రెండు చర్మంలోని మృతుకణాలను దూరం చేస్తాయి. ముఖం పగిలి పొలుసులుగా రాలకుండా ఉండాలంటే.. 2 స్పూన్ల తేనెలో కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే.. తప్పకుండా మంచి ఫలితాలు పొందవచ్చును.
 
ఇంకా చెప్పాలంటే.. టమోటాలను గుజ్జుగా చేసుకుని అందులో 2 స్పూన్ల నిమ్మరసం కొద్దిగా తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 20 నిమిషాలు అలానే ఉంచుకోవాలి. ఆపై నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే ముఖం ముడతలు పోతాయి. దాంతో చర్మం మృదువుగా, తాజాగా తయారవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సమయంలో మీ జీవితంలో ఎప్పుడూ చేయనంత మూర్ఖమైన పనులు చేస్తారు...