Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులను ఆశ్రయించిన ప్రీతీ జంగానియా... ఎందుకో తెలుసా?

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జంగానియా. 'తమ్ముడు', 'నరసింహా నాయుడు' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె సినీ కెరీర్ పెద్దగా క్లిక్ కాలేదు. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి... వైవాహిక జీ

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (16:37 IST)
బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జంగానియా. 'తమ్ముడు', 'నరసింహా నాయుడు' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె సినీ కెరీర్ పెద్దగా క్లిక్ కాలేదు. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి... వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె ముంబైలో నివసిస్తోంది. ఈమెకు ఓ కుమారుడు ఉన్నాడు. వయసు ఏడేళ్లు.
 
ఈ పరిస్థితుల్లో తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకున్నాడన్న కారణంతో పక్క అపార్ట్‌మెంట్‌లో నివాసముండే వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అపార్ట్‌మెంట్‌లో పిల్లలంతా కలిసి ఆడుకునే సమయంలో పిల్లల మధ్య గొడవ జరగగా.. ఓ వృద్ధుడు తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకోవటంతో పాటు అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు గెంటివేశారంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మొత్తంమీద చాలా కాలంగా మీడియాకు కనిపించని ప్రీతి.. కుమారుడు వివాదం కారణంగా మీడియా కంటికి కనిపించింది. 

సంబంధిత వార్తలు

లోకం మాధవి ఆస్తుల విలువ రూ.894 కోట్లు

మార్గదర్శి చిట్ ఫండ్‌కు వైకాపా నేత ఆర్కే రోజా లాయల్ కస్టమర్

సినీ నటి, ఏపీ మంత్రి రోజా చదివింది ఇంటర్, ఆస్తులు రూ. 13.7 కోట్లు

కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల

వైఎస్‌ అవినాష్‌రెడ్డి అఫిడవిట్‌లో వివేకానంద హత్య కేసు వివరాలు

టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

తర్వాతి కథనం
Show comments