Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరక్షణ పేరుతో దాడులా? ఇడియట్సే ఆ పని చేస్తారు : కంగనా రనౌత్

జంతువుల పేరుతో దాడులు జరిపేవారిని ఇడియట్స్ కిందే పరిగణిస్తారని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అభిప్రాయపడింది. ఆమె సద్గురు జగ్గీవాసుదేవ్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, 'జంతువులను రక్షించడం మ

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:41 IST)
జంతువుల పేరుతో దాడులు జరిపేవారిని ఇడియట్స్ కిందే పరిగణిస్తారని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అభిప్రాయపడింది. ఆమె సద్గురు జగ్గీవాసుదేవ్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, 'జంతువులను రక్షించడం ముఖ్యమే. కానీ, వాటిని కాపాడే క్రమంలో తెలివితక్కువగా ప్రవర్తించకూడదు. గోరక్షణ పేరుతో దాడులు చేయడం చాలా తప్పు. ఇడియట్లే అలా ప్రవర్తిస్తారు' అని వ్యాఖ్యానించారు.
 
'ఇలాంటి ఘటనల గురించి విన్నప్పుడు గుండె తరుక్కు పోతోంది. ఇది తప్పని అందరూ తెలుసుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయి కూడా లేగదూడలను ఎంతో జాగ్రత్తగా కాపాడేవారు. గోవులను కాపాడే ముందు విలువలని కాపాడాలి. జంతువులను కాపాడుకోవాలనుకోవడం మంచిదే. కానీ, ఆ కారణంతో మనుషులపై దాడి చేయడంలో అర్థం లేదు' అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా, గో సంరక్షణ పేరుతో ఇటీవల దేశవ్యాప్తంగా దాడులు పెచ్చుమీరుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని అల్వార్‌, హరియాణ రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితం ఇద్దరు యువకులపై దాడి చేసి హత్య చేసిన ఉదంతాలే ఇందుకు ఉదాహరణ. 

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments