Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలిపిరి పేలుడు ఘటన.. నిర్దోషులుగా తేల్చిన కోర్టు

Babu
, శనివారం, 16 డిశెంబరు 2023 (12:57 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అక్టోబరు 2003లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పీపుల్స్‌వార్ గ్రూపు పక్కా ప్రణాళికతో మందుపాతర పేల్చడంతో చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పీపుల్స్‌వార్ గ్రూపు అగ్రనేతలు సహా మొత్తం 33మందిపై కేసులు నమోదయ్యాయి.  
 
విచారణ అనంతరం తిరుపతి సహాయ సెషన్స్ న్యాయస్థానం నలుగురిలో ఒక్కొక్కరికీ నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ 2014లో తీర్పుచెప్పింది. దీంతో వారు జిల్లా కోర్టును ఆశ్రయించారు.
 
ఈ కేసులో నిన్న తీర్పు వెలువడింది. తిరుపతి నాలుగో అదనపు జిల్లా సెషన్సు న్యాయస్థానం ఇన్‌చార్జ్ న్యాయమూర్తి జి.అన్వర్ బాషా వీరిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరీంనగర్ రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు