Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుమానపు భర్త, భార్య సున్నిత అవయవాలు కోసి కారం చల్లి...

భార్యపై అనుమానంతో భర్త అత్యంత కిరాతకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. ఆమె అవయవాలు కోసం కారం చల్లాడు. నిప్పుతో కాల్చి పైశాచికంగా వ్యవహరించాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బేతంచెర్ల మండలానికి చెందిన యువతి, కృష్ణగిరి మండలానికి చ

అనుమానపు భర్త, భార్య సున్నిత అవయవాలు కోసి కారం చల్లి...
, గురువారం, 7 జూన్ 2018 (15:06 IST)
భార్యపై అనుమానంతో భర్త అత్యంత కిరాతకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. ఆమె అవయవాలు కోసం కారం చల్లాడు. నిప్పుతో కాల్చి పైశాచికంగా వ్యవహరించాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బేతంచెర్ల మండలానికి చెందిన యువతి, కృష్ణగిరి మండలానికి చెందిన రత్నమయ్య కుమారుడు రాజుకి ఇచ్చి 14 నెలల క్రితం వివాహం జరిపించారు. వారి కాపురం 15 రోజుల బానే సాగినా ఆ తరువాత సంసారంలో  కలతలు మొదలయ్యాయి. 
 
అప్పటి నుంచి భార్యపై అనుమానంతో పలుమార్లు చిత్రహింసలకు గురిచేశాడు. మంగళవారం మరింత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి, సున్నిత అవయవాలను కోసి కారం చల్లాడు. నిప్పుతో ఆమె కాళ్లు, నడుమ భాగంలో కాల్చాడు. రాత్రంతా భర్త పెట్టిన  బాధలను భరించిన యువతి ఉదయం అతను లేని సమయంలో తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. 
 
నిందితుడు రాజు మొదటి నుంచి అనుమాన ధోరణితో వ్యవహరించేవాడని, రాజుకు మొదటి వివాహం అత్త కూతురుతో జరగ్గా ఆమెను ఇలానే చిత్రహింసలకు గురిచేయడంతో విడిపోయిందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో వున్నట్లు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రలో కాంగ్రెస్‌ను పైకి లేపుతానంటున్న చాందీ... అంతా అదోలా చూస్తున్నారు...