Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియో 'హుజూర్'... 25 నెలల్లో 250 మిలియన్ల సబ్ స్క్రైబర్లు...

జియో 'హుజూర్'... 25 నెలల్లో 250 మిలియన్ల సబ్ స్క్రైబర్లు...
, బుధవారం, 17 అక్టోబరు 2018 (20:44 IST)
ఇంటర్నెట్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, టీవీ, వీడియో.. ఇలా ఒకటేమిటి అన్ని సౌకర్యాలను అత్యంత స్వల్ప ధరలకే అందిస్తూ భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్న జియో కేవలం 25 నెలల్లో ఏకంగా 250 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుని మెరుపు వేగంతో దూసుకు వెళుతోంది. జియో అందిస్తున్న సౌకర్యాలకు వినియోగదారుల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనెక్టివిటీ కూడా ఎలాంటి అవాంతరాలు లేకపోవడంతో వారి ఫస్ట్ చాయిస్ జియో అవుతోంది.
 
ఇకపోతే... జియో తన రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో డేటా వినియోగం రికార్డు స్థాయిలో 771 కోట్ల జిబికి చేరుకున్నదనీ, నెలకు ఒక్కో వినియోగదారుడు సగటున 11 జిబి వినియోగించుకున్నాడనీ తెలియజేశారు. ఈ వినియోగం రోజురోజుకీ పెరుగుతూ వెళ్తున్నట్లు తెలియజేశారు. మొత్తం 1100 నగరాల్లో ఎఫ్.టి.టి.హెచ్ కోసం రిజిస్ట్రేషన్లు చాలా బలంగా వున్నట్లు ప్రకటించారు. మొత్తమ్మీద జియో దేశంలో సంచలనాలకు పెట్టిందిపేరుగా ముందుకు వెళుతూ తనకు తానే సాటిగా దూసుకువెళుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ మొగుడు.. నేను ఉండగా.. మరొకడు కావాలా? వివాహితకు కత్తిపోట్లు