Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. గ్రేస్ మార్కులు కలిపేందుకు ఒకే...

tn students
, ఆదివారం, 17 డిశెంబరు 2023 (10:08 IST)
హైదరాబాద్ నగరంలోని జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు శుభవార్త వెలువడింది. ఈ పరిధిలోని కాలేజీలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చేందుకు యూనివర్శిటీ సమ్మతం తెలిపింది. విద్యార్థులు కోరడంతో డీన్‌లతో మాట్లాడిన యూనివర్శిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. 
 
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జెఎన్టీయూహెచ్) కీలక ప్రకటన చేసింది. యూనివర్సిటీ పరిధిలో 2022-23 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపుతున్నట్టు వెల్లడించింది. డిప్లొమా పూర్తిచేసిన ఇంజినీరింగ్ విద్యార్థులకు 23 మార్కులు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ విద్యార్థులకు 30 మార్కులు కలుపుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
కరోనా సమయంలో విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపామని, ఈసారి విద్యార్థులు విజ్ఞప్తి చేయడంతో మార్కులు కలిపి1నట్టు అధికారులు వివరించారు. ఇంజినీరింగ్‌లోని అన్ని విభాగాల డీన్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామని, తక్షణమే నిర్ణయం ఆచరణలోకి వస్తుందని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. కాగా గ్రేస్ మార్కులు పెంచుతూ యూనివర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 
 
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను చంపేస్తారా? 
 
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ప్రాణముప్పు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనకు భద్రతను పెంచాలన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా రతన్ టాటాను గుర్తు తెలియని ఓ వ్యక్తి బెదిరించాడు. దీంతో టాటా ప్రామాలకు ముప్పు పొంచివుందని, పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైరస్ మిస్త్రీ మాదిరిగానే జరుగుతుందని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన హెచ్చరించాడు. ఆ హెచ్చరించిన వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. 
 
కర్ణాటక నుంచి ఫోన్ చేశాడని దర్యాప్తులో తేల్చారు. కాగా నిందితుడు కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బెదిరింపు కాల్ అయినన్పటికీ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. రతన్ టాటా నివాసం వద్ద వెంటనే తనిఖీలు చేపట్టి భద్రతను పెంచినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. 
 
వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ గతేడాది సెప్టెంబరులో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కారులో అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మిస్త్రీతో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. 
 
కదలుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్.. రాజస్థాన్‌లో దారుణం 
 
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. క్యాబిన్‌లో కూర్చొన్న బాలికపై వంతుల వారీగా ఇద్దరు డ్రైవర్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. బస్సులోని ప్రయాణికులు అనుమానంతో క్యాబిన్ డోర్ తీయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆ తర్వాత డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదాడు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని బస్సీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఫూల్ చంద్ మీనా మీడియాకు వెల్లడించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  జైపూర్‌లోని తన మామయ్య ఇంటికి వెళ్లేందుకు డిసెంబర్ 9న రాత్రి 7:30 గంటల సమయంలో బాలిక బస్సు ఎక్కింది. సీటు దొరక్కపోవడంతో బస్సు క్యాబిన్‌లోనే కూర్చొని ప్రయాణించింది. క్యాబిన్‌లో కూర్చున్న కొందరు ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో దిగిపోయాక డ్రైవర్లు ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంతులవారీగా ఆమెపై అత్యాచారం చేశారని ఫూల్ చంద్ మీనా వివరించారు.
 
ఏదో అనుమానాస్పదంగా అనిపించడంతో బస్సులోని కొందరు ప్రయాణికులు క్యాబిన్ డోర్ తెరవడంతో ఈ అఘాయిత్యం బయటపడింది. బాలిక దీన స్థితిలో ఉండడాన్ని గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారని మీనా వెల్లడించారు. అయితే ఒక డ్రైవర్ పారిపోగా మరో వ్యక్తిని పట్టుకున్నారని చెప్పారు. ప్రయాణికులు బస్సును ఒక పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి ఆపారని, బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. 
 
బాలిక మామయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా కోరారని ఫూల్ చంద్ మీనా పేర్కొన్నారు. అక్కడికి చేరుకున్న బాలిక మావయ్య అత్యాచారంపై ఫిర్యాదు చేశాడని వివరించారు. కాగా నిందిత బస్సు డ్రైవర్లలో మహ్మద్ ఆరిఫ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మరో నిందితుడిని లలిత్ గుర్తించామని, అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ అత్యాచార ఘటన 2012లో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనను గుర్తుకు తెచ్చింది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరగగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను చంపేస్తారా?