Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రేటర్ నోయిడాలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..

victim woman
, మంగళవారం, 2 జనవరి 2024 (13:40 IST)
దేశ రాజధాని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్.సి.ఆర్) పరిధిలోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ బాధితురాలిపై గతంలో అఘాయిత్యం జరిగింది. ఈ నెల 30వ తేదీన మరోమారు మహిళకు ఫోన్ చేసి బ్లాక్‌మెయిలింగ్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు కామాంధులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
గ్రేటర్ నోయిడాలోని ఓ షాపింగ్ మాల్‌ సమీపంలో 26 యేళ్ళ మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరుక ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశఆరు. మరో ఇద్దరు పరారీలో ఉండగా, ఒకరు స్థానికంగా బలమైన వ్యక్తి అని పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ అత్యాచార ఘటన గతంలో జరిగింది. ఇపుడు ఈ మళ్లీ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ వేధించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... రాజ్ కుమార్, ఆజాద్, వికాస్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రవి, మేహ్మి అనే మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం. వీరిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. అరెస్టు అయిన నిందితులను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్బీఐ పింక్ నోట్ల రద్దు... 97.38 శాతం ఓట్లే తిరిగొచ్చాయ్