Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్థరాత్రి బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ.. బైకుపై దింపుతామని నమ్మించి....

woman victim
, సోమవారం, 18 డిశెంబరు 2023 (12:18 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యాచారానికిగురైంది. తార్నాక బస్టాపులో అర్థరాత్రిపూట బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళను కొందరు కామాంధులు మాటలు కలిపి.. బైకుపై దింపుతామని నమ్మించారు. ఆ తర్వాత తమ బైకుపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన ఈ నల 7వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 7వ తేదీన తార్నాకలోని ఓ మహిళ బస్టాప్‌లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా, ఆ సమయంలో బైకుపై అటుగా వెళుతున్న బర్న యేసు (32) అనే వ్యక్తి ఆమెను గమనించాడు. ఆ తర్వాత ఆమె వద్దకు వెళ్లి మాటలు కలిపి, తాను బైకుపై తీసుకెళ్లి దింపుతానని నమ్మించాడు. యేసు మాటలు నమ్మిన ఆ మహిళ అతనితో బైకుపై వెళ్లగా, ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం. ఆ తర్వాత తన స్నేహితులకు కూడా సమాచారం చేరవేయడంతో వారు కూడా అక్కడకు వచ్చి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. పిమ్మట బాధితురాలిని తీసుకొచ్చి మళ్లీ తార్నాక బస్టాండులోనే వదిలిపెట్టారు. ఎనిమిదో తేదీ నుంచి మౌనంగా ఉంటూ వచ్చిన ఆ మహిళ... చివరకు లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. తార్నాక బస్టాప్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందిడైన బర్న యేసుతో పాటు మధుయాదవ్ (31), ప్రశాంత్ (20), తరుణ్ (20), రోహిత్ (19)లను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెక్సికోలో కాల్పుల మోత... దుండగుడి కాల్పుల్లో 16 మంది మృతి