Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తులసి ఆకుల పేస్ట్, ఉప్పు జతచేస్తే..?

తులసి ఆకుల పేస్ట్, ఉప్పు జతచేస్తే..?
, మంగళవారం, 27 నవంబరు 2018 (10:35 IST)
చలికాలంలో వచ్చే జలుబు కారణంగా పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో పాటు ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు. ఎక్కువగా చెప్పాలంటే.. జలుబు సమస్య ఎక్కువగా వేధిస్తుంది. ఈ జలుబును తగ్గించడానికి వైద్య చికిత్సలు తీసుకుని రకరకాల మందులు వాడుతుంటారు. వీటిని వాడడం వలన సమస్య మరింత పెరిగే ప్రమాదం ముందని చెప్తున్నారు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
.
 
1. కప్పు నీళ్లల్లో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
2. గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు, జాజికాయ చూర్ణం కలిపి మరిగించి చల్లారిన తరువాత తీసుకుంటే జలుబు, ఇతర వ్యాధులు కూడా తొలగిపోతాయి. 
 
3. ప్రతిరోజూ మీరు తీసుకునే పాలలో కొద్దిగా పసుపు కలిపి తీసుకుంటే జలుబు వెంటనే తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు. 
 
4. సాధారణంగా చాలామంది వేనీళ్లు అంతగా తాగరు. దీని కారణంగానే పలురకాల అనారోగ్యాలా పాలవుతున్నారు. రోజూ గ్లాస్ వేనీళ్లు తీసుకోవడం వలన గొంతునొప్పి, తలనొప్పి వంటి సమస్యలుండవు. 
 
5. తులసి కోట ప్రతి ఇంట్లో ఉంటుంది.. కాబట్టి కొన్ని తులసి ఆకులను పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి. ఇలా రోజూ చేస్తే.. జలుబు తగ్గుముఖం పడుతుంది. లేదా తులసి టీ తీసుకున్నా మంచిదే.
 
6. తమలపాకుల రసంలా చేసి అందులో లవంగాల పొడి, అల్లం రసం, తేనే లేదా చక్కెర కలిపి సేవిస్తే జలుబు తగ్గుతుంది. మిరియాలను నెయ్యిలో వేయించి పొడిచేసి పాలలో కలిపి తాగితే అనారోగ్యాలు దరిచేరవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఇనుము'తో బట్టతలకు అడ్డుకట్ట