Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండ్ల రసాలు ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి?

పండ్ల రసాలు ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి?
, సోమవారం, 15 అక్టోబరు 2018 (13:27 IST)
పండ్ల రసాలు తీసుకుంటుంటారు కొందరు. రోజంతా కేవలం పళ్ల రసాలనే తాగుతారు. కొన్ని అనారోగ్య సమస్యలు వున్నవారు ఒకే పండుతో తయారుచేసిన రసాలను తీసుకుంటుంటారు. ఐతే ఈ రసాలను ఎవరు తీసుకుంటారు... వాటి ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. 
 
జ్యూస్ డైట్ ఎవరు తీసుకోవాలి?
బరువు తగ్గడానికి, పెద్దపేగు పనితీరు బాగుండడానికి, ప్రొబయాటిక్ థెరపీ కోసం 20-40 ఏళ్ల మధ్యనున్న వారికి ఈ జ్యూస్ డైట్‌ని తీసుకోమంటుంటారు. కేన్సర్లతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా జ్యూస్ డైట్‌ను సూచిస్తుంటారు. పెద్దవాళ్లకు కూడా జ్యూస్ డైట్ మంచిది. వారిలో ఆకలిని ఇది పెంచుతుంది. ప్రత్యేకంగా వైద్యులు సూచించే జ్యూసుల్లో ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిక్స్ పేషెంట్లు, కిడ్నీ, కాలేయం జబ్బులతో బాధపడేవాళ్లు డాక్టర్ల సలహా మేరకు ఈ డైట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 
 
చాలామంది బరువు తగ్గడానికి ఈ డైట్‌ను ఫాలో అవుతుంటారు. ఈ జ్యూసును తీసిన రెండు గంటల లోపు తాగాలి. ఒక పర్యాయం 500 ఎంఎల్ జ్యూసు తీసుకోవచ్చు. రోజంతా జ్యూస్ డైట్ మీద ఉండేవాళ్లు రోజుకు ఎనిమిది సార్లు జ్యూసులు తాగాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మటన్ కబాబ్ తయారీ విధానం...