Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమ్మూలో బ్రెయిన్ స్ట్రోక్‌తో ఏపీ జవాన్ మృతి

jawan
, బుధవారం, 20 డిశెంబరు 2023 (11:27 IST)
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో జమ్మూలో సైనికుడిగా పనిచేస్తున్న తంతటి కిరణ్ కుమార్ (41) బ్రెయిన్ స్ట్రోక్‌తో సోమవారం మృతి చెందాడు. తుని మండలం హంసవరం గ్రామం ఆయన స్వస్థలం. కిరణ్‌కుమార్‌ మృతి వార్త తెలియగానే ఆయన భార్య విజయకుమారి, సోదరుడు రవికుమార్‌ జమ్ముకు చేరుకున్నారు.
 
శ్రీనగర్ విమానాశ్రయంలో కిరణ్ కుమార్ మృతదేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు వారికి అప్పగించారు. భర్త మృతదేహాన్ని చూసి విజయకుమారి కన్నీరుమున్నీరుగా విలపించారు. రాత్రికి విశాఖపట్నం చేరుకుని ఉదయం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తామని బంధువులు తెలిపారు. కిరణ్‌కుమార్ మృతదేహానికి బుధవారం ఉదయం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
కిరణ్ కుమార్‌కు భార్యతో పాటు కుమారుడు జతిన్ (12), కుమార్తె మెర్సీ (10), తల్లిదండ్రులు జాన్, భాగ్యవతి ఉన్నారు. ఇద్దరు కొడుకులు దేశసేవలో ఉన్నారు హంసవరం గ్రామానికి చెందిన జాన్, భాగ్యవతి దంపతులకు ముగ్గురు కుమారులు. 
 
మొదటి కుమారుడు గ్రామంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా, రెండో కుమారుడు కిరణ్ కుమార్ 2005లో సీఆర్పీఎఫ్‌లో చేరగా.. మూడో కుమారుడు రవికుమార్ ఆర్మీలో చేరాడు. తమ ఇద్దరు కుమారులు దేశ రక్షణలో సేవలందించడం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగించిందని, కిరణ్‌కుమార్‌ మృతి తమను విషాదంలో ముంచెత్తిందని తల్లిదండ్రులు విలపించారు. 
 
కిరణ్ కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్ రాయి మేరీ అవినాష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ వరదలు.. తిరునెల్వేలి రైల్వేస్టేషన్‌లో మొదలైన రైళ్ల రాకపోకలు