Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శబరిమలలో భక్తుల రద్దీ... రూ.200 కోట్లు దాటిన ఆదాయం

sabarimala
, మంగళవారం, 26 డిశెంబరు 2023 (17:41 IST)
కేరళలో శబరిమల అయ్యప్పకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన వారితో శబరిమల ఆదాయం రూ.200 కోట్లు దాటింది. 39 రోజుల క్రితం ప్రారంభమైన అయ్యప్ప దర్శనాల్లో భాగంగా ఇప్పటివరకు 31 లక్షల మంది శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్లు ఆలయ బోర్డు వెల్లడించింది. ఇందులో కానుకల రూపంలో రూ. 63.89 కోట్లు రాగా.. అర‌వ‌న ప్ర‌సాదం ద్వారా రూ. 96.32 కోట్ల ఆదాయం ఆలయానికి వ‌చ్చిందని తెలిపింది. 
 
ఇక ఈ మండ‌ల విరక్కు పూజ కాలంలో డిసెంబర్ 25 వ తేదీ నాటికి 39 రోజుల్లో 31,43,163 మంది భ‌క్తులు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డు వెల్లడించింది. రేపు డిసెంబర్ 27న మూతపడనున్న అయ్యప్ప ఆలయం.. మ‌క‌ర‌విల‌క్కు పండుగ కోసం మ‌ళ్లీ డిసెంబ‌ర్ 30వ తేదీన శబరిమల ఆల‌యాన్ని తెర‌వ‌నున్నట్లు స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఏడాదిలో రాణించిన ఆరుగురు క్రికెటర్లు