Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వందే భారత్‌ రైలులో మంటలు... వరుస ప్రమాదాలతో ప్రయాణికుల బెంబేలు

vande bharat train fire
, సోమవారం, 17 జులై 2023 (10:11 IST)
దేశంలో సెమీ స్పీడ్ రైళ్లుగా పరుగులు పెడుతున్న వందే భారత్ రైళ్లలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో దున్నపోతును ఢీకొనడంతో ఈ రైలు ముందు డోమ్ ఊడిపోయింది. మరోమారు భారీ వర్షానికి వందే భారత్ రైలు లోపలి భాగం తడిసి ముద్దయింది. తాజాగా వందే భారత్ రైలింజిన్ ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. దీన్ని గమనించిన లోకే పైలెట్లు తక్షణం రైలును నిలిపివేసి మంటలను అదుపు చేడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
ఈ రేలు ఢిల్లీ వెళుతుండగా రాణి కమలాపతి (భోపాల్) - హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. రైలు ఇంజన్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన లోకోపైలెట్లు కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపకదళ సిబ్బంది రైలు ఇంజిన్ వద్ద చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఇంజిన్‌కు మంటలు అంటుకోవడంతో రైలు ఆపిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పక్కనే కూర్చొన్నారు. రైలు ఇంజిన్‌లోని బ్యాటరీలు తగలబడటం వల్లే ఈ మంటలు చెలరేగాయని, ఈ బ్యాటరీలను తొలగించిన తర్వాత రైలు తిరిగి బయలుదేరి వెళ్లిందని రైల్వే శాఖ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టమోటా సాగుతో నెల రోజుల్లో కోటీశ్వరుడుగా మారిన రైతు