Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి భక్తులకు శుభవార్త.. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

Tirumala
, శనివారం, 4 నవంబరు 2023 (17:46 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మంచి శుభవార్తను చెప్పింది. ఈ వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 23వ తేదీ నుంచి వచ్చే జనవరి 1 వరకు ఉంటుందని టీటీడీ తెలిపింది. 
 
ఏకంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ తెలిపింది. దీనికి సంబంధించిన 2.25 లక్షల టికెట్లు నవంబర్ 10 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని కూడా తెలిపింది. 
 
డిసెంబర్ 22న వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 4.25 లక్షల టైంస్లాట్ సర్వ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని టీటీడీ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-11-2023 శనివారం రాశిఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేయించి తీర్థం తీసుకున్నా శుభం...