Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్

kcrao
, శుక్రవారం, 15 డిశెంబరు 2023 (11:44 IST)
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబదా్ నగరంలోని నందవనంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. ఈ నెల మూడో తేదీన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. దీంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ రోజు సాయంత్రమే ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాత్రూమ్‌లో కాలుజారి పడటంతో కాలు తుంటె ఎముక విరిగిపోయింది. దీంతో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఈ నెల 8వ తేదీన తుంటి మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, తెలంగాణ మంత్రులు ఇలా అనేక మంది ప్రముఖులు పరామర్శించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన... బంజారా హిల్స్ నందినగర్‌లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేంత వరకు ఈ ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. అయితే, ఆయన సంపూర్ణంగా కోలుకునేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం అంటే రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. 


వింత ఆచారం... అక్కడ తల్లీకూతుళ్లిద్దరికీ భర్త ఒక్కరే... 
 
సాధారణంగా వివాహం అంటే రెండు మనసుల కలయిక. ఇరు కుటుంబాల కలయిక. అయితే, ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా తెలిసిన వారు, బంధువులు సంబంధాల కంటే పరిచయం లేని వ్యక్తులు, దూరపు సంబంధాల్నే చేసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాగే, కొన్ని సందర్భాల్లో కొందరు రక్త సంబంధాలు, మేనరికం పేరుతో బావ లేదా మేనమామను పెళ్లి చేసుకుంటారు. కానీ కూతురే కన్న తండ్రిని వివాహం చేసుకోవడం ఎక్కడైనా చూశారా? తల్లీకూతుళ్లిద్దరికీ భర్త ఒక్కరే అన్న వింత గురించి మీరెప్పుడైనా విన్నారా? ఈ మాట వింటుంటే చెవుల్లో సీసం పోసినట్టుగా ఉంది కదా. ఈ కంఠోరంగా ఉన్న ఈ విడ్డూరాన్ని ఓ తెగ ప్రజలు ఆచారంగా పాటిస్తుంది. ఇంతకీ ఆ తెగ ఎక్కడుంది... వారి సంప్రదాయం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఏంటి అనేది పరిశీలిస్తే, 
 
బంగ్లాదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతాల్లో నివశించే ప్రాచీన తెగల్లో మండి తెగ ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి భాష, ఆచార వ్యవహారాలు ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉండటం గమనించవచ్చు. కన్న కుమార్తెను తండ్రే పెళ్లి చేసుకునే పద్దతి కూడా ఇందులో ఒకటి. ఈ క్రమంలో ఊహ తెలియని వయసులోనే అమ్మాయిలకు తమ తండ్రులతో వివాహం చేసినా, 15 యేళ్లనేళ్ళు నిండిన తర్వాత కాపురం చేయిస్తారట. ఇలా ఈ తెగలో తల్లీబిడ్డలిద్దరికీ భర్త ఒక్కరే ఉంటారన్నమాట. 
 
ఒకవేళ భర్త చనిపోతే అదే తెగకు చెందిన ఓ వ్యక్తి ముందు తల్లిని పెళ్లి చేసుకోవడం, ఆమె సంతానాన్ని తమ సొంత పిల్లలుగా చూసుకోవడం ఈ తెగ వాసుల ఆచారం. ఇక ఈ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే సవతి తండ్రిని పెళ్లి చేసుకోవాలన్న నిబంధన కూడా ఉంది. ఈ మాట వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ మండి తెగ ప్రజలు మాత్రం ప్రాచీన కాలం నుంచే పాటిస్తున్నట్టుగా అక్కడి వారు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మన దేశమే కాదు ప్రపంచమే నవ్వుతోంది