Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే వైకాపా... : సబ్బం హరి జోస్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే విపక్ష పార్టీ అయిన వైకాపా అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ,

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే విపక్ష పార్టీ అయిన వైకాపా అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీదే విజయమన్నారు.
 
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు కన్నా మంచి నాయకత్వం ఇస్తామన్న భరోసాను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌ కుక్కలు చింపిన విస్తరిగా తయారైందని, పార్లమెంట్‌లో ప్రజాసామ్యానికి చోటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఏపీలో బీజేపీ ఉనికే లేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయం, మోసాల గురించి ప్రజలకు వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా సఫలమయ్యారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్‌ పడిపోతున్నదని, బీజేపీకి ప్రజాదరణ తగ్గిపోతున్నదని హరి అన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, అయితే ఏ పార్టీ తరపున అనేది త్వరలో తెలియజేస్తానన్నారు.

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments