Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెడతా - బిజెపి అధ్యక్షుడు కన్నా

ఎపి ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు..టిడిపి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు ఎపిలో చేసిన అభివృద్థికి నిధులు సగానికిపైగా ఇచ్చింది

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (21:01 IST)
ఎపి ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు..టిడిపి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు ఎపిలో చేసిన అభివృద్థికి నిధులు సగానికిపైగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని చెప్పారాయన. కేంద్రం నిధులు ఇచ్చినా ఏమీ ఇవ్వలేదంటూ టిడిపి నేతలు చెబుతుండడం మంచిది కాదన్నారు. అందుకే నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామని చెప్పారు.
 
నాలుగేళ్ళలో ఖాళీగా కనిపించిన భూములను తెలుగు తమ్ముళ్ళు దర్జాగా కబ్జా చేసేశారని, వాటిని చంద్రబాబునాయుడు ప్రోత్సహించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎపిలో బిజెపి విజయం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాలుగు సంవత్సరాల పాలన, అమలు చేసిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు సఫలీకృతులయ్యారన్నారు కన్నా లక్ష్మీనారాయణ. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments