Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.999కే విమాన ప్రయాణం.. ఫెస్టివల్ సేల్... బుకింగ్స్ ప్రారంభం

దేశంలో చౌక ధరలకే విమాన సేవలను అందుబాటులోకి తెచ్చిన ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో. ఈ సంస్థ ఇపుడు మరోమారు అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫెస్టివల్ సేల్ పేరుతో ఈ టిక్కె

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (16:31 IST)
దేశంలో చౌక ధరలకే విమాన సేవలను అందుబాటులోకి తెచ్చిన ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో. ఈ సంస్థ ఇపుడు మరోమారు అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫెస్టివల్ సేల్ పేరుతో ఈ టిక్కెట్ల విక్రయానికి శ్రీకారం చుట్టింది. స్వదేశీ సర్వీసుల్లో టిక్కెట్ ప్రారంభ ధర రూ.999గాను, అంతర్జాతీయ సర్వీసులకు రూ.3199గా నిర్ణయించింది.
 
ఇందులోభాగంగా, ఈ టిక్కెట్ల విక్రయం సోమవారం నుంచి ప్రారంభించి, ఈనెల 16వ తేదీ వరకు విక్రయించనుంది. ఈ ఆఫర్ కింద ఏకంగా 10 లక్షల టిక్కెట్లను విక్రయానికి ఉంచింది. ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టిక్కెట్లు ఈనెల 18వ తేదీ నుంచి 2019 మార్చి 30వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. 
 
జూలైలో 1.2 మిలియన్ సీట్లను రూ.1212 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంచింది. దీనికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఇపుడు మరోమారు ఇదే తరహా ఆఫర్‌ కింద టిక్కెట్లను విక్రయించనుంది. 
 
కాగా, మొబిక్విక్ మొబైల్ వాలెట్ నుంచి టికెట్లను కొనుగోలు చేసే వినియోగదారులకు 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఇండిగో దేశ వ్యాప్తంగా రోజుకు 52 గమ్యస్థానాల్లో 1,100 విమాన సర్వీసులును నడుపుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments