Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట పెరుగు తీసుకోవాలనుకుంటే.. తేనే, మిరియాల పొడిని?

అలసిపోయిన శరీరానికి తక్షణ ఉపశమనం పొందాలంటే, ఒక స్పూన్ పంచదారలో రెండు స్పూన్ల పంచదారను కలిపి బాగా మిక్స్ చేసుకుని తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలసిపోయిన శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది.

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (10:19 IST)
అలసిపోయిన శరీరానికి తక్షణ ఉపశమనం పొందాలంటే, ఒక స్పూన్ పంచదారలో రెండు స్పూన్ల పంచదారను కలిపి బాగా మిక్స్ చేసుకుని తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలసిపోయిన శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది.
 
అధిక బరువు తగ్గాలనుకునే వారు... రోజూ అర స్పూన్ జీలకర్రను.. పెరుగులో చేర్చి తీసుకుంటే ఒబిసిటీ మటాష్ అవుతుంది. రాత్రిపూట పెరుగు తీసుకోవాలనుకునేవారు ఓ కప్పు పెరుగులో అర స్పూన్ తేనే, అరస్పూన్ మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి. ప‌గ‌టి పూట పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చాలా మేలు క‌లుగుతుంది‌. 
 
కానీ రాత్రి పూట పెరుగును తింటే శ‌రీరంలో మ్యూక‌స్ ఎక్కువ‌గా వృద్ధి చెందుతుంద‌ట‌. దీని వ‌ల్ల జ‌లుబు, అధిక క‌ఫం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అందుకే రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం మిరియాల పొడి, తేనెను కలిపి తీసుకోవడం ద్వారా జలుబు, కఫం వంటి సమస్యలను దూరం  చేసుకోవచ్చు. 
 
పెరుగును రోజూ తీసుకోవడం ద్వారా శరీరం నుంచి అధిక ఉష్ణం బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. అంతేకాకుండా జీర్ణ‌శ‌క్తి వృద్ధి చెందుతుంది. క‌డుపులో మంట తొల‌గిపోతుంది. శారీర‌క దృఢ‌త్వం క‌లుగుతుంది. పెరుగులో పుష్క‌లంగా ల‌భించే కాల్షియం ఎముక‌లకు చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments