Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయోధ్యలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట చేశారు.. సీతారాములకి ఎందుకు చేయలేదు?

chaganti

వరుణ్

, బుధవారం, 24 జనవరి 2024 (12:43 IST)
అయోధ్యలో బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ చేశారు.. సీతరాముల వారుని ఎందుకు చేయలేదన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు తన ట్విట్టర్ ఖాతాలో సమాధానమిచ్చారు. 
 
సముద్రగుప్త, విక్రమాదిత్య కాలం 1076 - 1126 సీఈకి ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉందని, అప్పుడే రామ్ లల్లా అని 56 అంగుళాల మూర్తి బాల రాములు ఉండే వారనీ, ఇపుడు మనం మళ్ళీ అదే స్థలంలో ఆలయం పునః నిర్మించారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైనపుడు... మన చరిత్రని పరిగణలోకి తీసుకొని అదే బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్నారు.  
 
బాల రాముడు వయసు 5-6 సంవత్సరాల మధ్య ఉండే విధంగా మలిచారనీ, అయోధ్యలో రామాలయ మొదటి అంతస్తులో గర్భగుడిలో బాల రాముడు వారు ఉన్నారనీ, ఇంకా 2 అంతస్తులు ఉన్నాయని తెలిపారు. పైగా, గుడి పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత సీతరాములు, లక్ష్మణ, హనుమ స్వామితో సహా పలు విగ్రహాలకు  ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, అలాగే మాతకౌసల్య దేవికి కూడా ఆలయంలో పూజలు చేస్తారని, జై శ్రీరామ్ అంటూ తన సమాధానమిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-01-2024 బుధవారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...