Webdunia - Bharat's app for daily news and videos

Install App

చితికి నిప్పంటించగానే లేచి కూర్చొంది.. ఆస్పత్రికి వెళ్ళగానే చనిపోయింది...

పాముకాటుకు గురైన ఓ యువతి చనిపోయిందని భావించి భౌతికకాయాన్ని కాల్చేందుకు చితికి నిప్పంటించారు. కానీ, ఆ యువతిలో చలనం కనిపించింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ తుదిశ్వాస విడిచింది. తాజాగా

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (13:50 IST)
పాముకాటుకు గురైన ఓ యువతి చనిపోయిందని భావించి భౌతికకాయాన్ని కాల్చేందుకు చితికి నిప్పంటించారు. కానీ, ఆ యువతిలో చలనం కనిపించింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ తుదిశ్వాస విడిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జార్ఖండ్‌ రాష్ట్రంలోని చత్రాకు సమీపంలోని సోఖా ప్రాంతానికి చెందిన అమర్‌ చౌదరి కుమార్తె క్రాంతి కుమారి(16). ఈ యువతి ఆరుబయట నిద్రిస్తుండగా పాము కరిచింది. విష ప్రభావంతో స్పృహ కోల్పోయింది. ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోవడంతో కుటుంబ సభ్యులు, చుట్టు పక్కలవారు ఆమెను లేపేందుకు ప్రయత్నించారు. అయితే క్రాంతి కుమారిలో ఎటువంటి చలనం లేకపోవడంతో మృతి చెందిందనే నిర్ధారణకు వచ్చారు. 
 
ఆ తర్వాత కుమారికి కర్మకాండలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసి మృతదేహాన్ని శ్మశానికి కూడా తీసుకెళ్లారు. భౌతికకాయాన్ని చితిపై పెట్టి... నిప్పు అంటించగానే ఆ యువతి చేతులు కదిలించింది. దీంతో ఆ యువతిని కిందికి దించి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు పెద్దాస్పత్రికి తరలిస్తుండగా యువతి కన్నుమూసింది. దీంతో తొలుత సిద్ధం చేసిన చితిపైనే దహన సంస్కారాలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments