Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ మినీ కాంగ్రెస్.. ముస్లింలకు మోడీ వకాల్తాదారు : తొగాడియా నిప్పులు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా నిప్పులు చెరిగారు. మోడీ సారథ్యంలోని బీజేపీ ఇపుడు ఓ మినీ కాంగ్రెస్‌గా మారిపోయిందంటూ ఆరోపించారు. అంతేకాకుండా, మ

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:57 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా నిప్పులు చెరిగారు. మోడీ సారథ్యంలోని బీజేపీ ఇపుడు ఓ మినీ కాంగ్రెస్‌గా మారిపోయిందంటూ ఆరోపించారు. అంతేకాకుండా, మోడీ కూడా ముస్లింలకు వకాల్తాదారుగా మారారని చెప్పారు.
 
ఇదే అంశంపై ఆయన మధురలో మాట్లాడుతూ, ముస్లింలలో ఉన్న ట్రిపుల్ తలాక్ దురాచారం నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం తీసుకురావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ముస్లింల తరపున వకాల్తాదారు(న్యాయవాది)గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ట్రిపుల్ తలాక్ అన్నది ముస్లింల వ్యక్తిగత విషయమని, అందులో మోడీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, శ్రీరాముడి పేరుతో ఎన్నికల్లో నెగ్గిన ఆయన, హిందూ దేశ పరిరక్షణ, కాశ్మీర్‌లోని హిందువులను రక్షించడం లేదని ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా అయోధ్యలో రామమందిరం నిర్మించకపోవడం ప్రధాని నరేంద్ర మోడీ అసమర్థతకు నిదర్శనమన్నారు. బీజేపీ మినీ కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments