Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి తిళ్లు వలన జీర్ణకోసం పొరలు పాడవుతాయ్....

ప్రతి ఒక్కరూ జీవించాలి అంటే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ తీసుకునే ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అనారోగ్యం వస్తుంది. అంతేగాక తీపి కలిగిన చిరుతిండ్ల వలన శరీర పోషణ కుంటుపడి పోగలదు. తీపిని అధికంగా సేవించటం వలన ఆ తీపి శరీర ఖనిజాలను, విటమిన్లను, పోషక శక్తి

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (20:52 IST)
ప్రతి ఒక్కరూ జీవించాలి అంటే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ తీసుకునే ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అనారోగ్యం వస్తుంది. అంతేగాక తీపి కలిగిన చిరుతిండ్ల వలన శరీర పోషణ కుంటుపడి పోగలదు. తీపిని అధికంగా సేవించటం వలన ఆ తీపి శరీర ఖనిజాలను, విటమిన్లను, పోషక శక్తిని హరించగలదు. ఇక కారం, మసాలా దినుసులు అధికంగా కలిగిన చిరుతిండ్లు తినడం వలన జీర్ణకోశంలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణకోశం లోపల గల అరలను తినివేయగలదు. అందువలన కడుపులో మంట, నొప్పి, వాపు మెుదలగు ఉదర జీర్ణకోశ సంబంధమైన అనారోగ్యములు తలెత్తుతాయి. 
 
ఆహారం వేళాపాలా లేకుండా తీసుకోవడం వల్ల తిన్నఆహారం సరిగా జీర్ణంకాక కడుపులో అపానవాయువు చేరుట, బరువుగా నుండుట, గుండెలలో మంట, శరీర అలసట, మానసిక నిరుత్సాహం, అజీర్తి, విసుగుదల, నిద్రపట్టకపోవటం వంటి శారీరక, మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. సమగ్ర పౌష్టికాహారం వల్లనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. క్రొవ్వు పదార్ధాలు, పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ పదార్ధాలు, నీరు... వీటిలో పిండి పదార్ధాలు, మాంసకృత్తులు, క్రొవ్వుపదార్ధాలు మనిషి శరీరానికి అతి ముఖ్యమైనవి. 
 
నీరు, ఖనిజాలు, విటమిన్లు లాంటివి శరీరక్రమం సాఫీగా ఉండేటట్లు చేస్తుంటాయి. వీటిలో నీరు ప్రతి అవయవాన్ని సమర్ధవంతంగా పనిచేయటానికి  ఎంతగానో ఉపకరిస్తుంది. కార్బోహైడ్రేట్లలో జిగురు, పిండిపదార్ధము, చక్కెర ఉంటాయి. అంతేకాకుండా పండిన అరటిపండ్లు, చెరకు, పాలు, తేనె, మాంసములలో కూడా పిండిపదార్ధములు అధికంగా ఉంటాయి. ఈ పిండిపదార్ధముల వలన దేహానికి వేడి కలగటం, పనులు చెయ్యటానికి తగిన శక్తి లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments